ANDHRABREAKING NEWS

శ్రీశైలం గోశాలలో గోవులపై చిరుత దాడి.?

తెలుగు వార్త :న్యూస్

శ్రీశైలం గోశాలలో గోవులపై చిరుత దాడి.?

శ్రీశైలం తెలుగు వార్త న్యూస్ (మార్చి 29):-శ్రీశైలంగోశాలలో గోమందపై చిరుతపులి దాడిచేసింది, చిరుత దాడిలో ఒక గోవు మరణించింది, మరో గోవు మూతికి గాయాలయ్యాయి. గోవులపై చిరుతదాడి విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దేవస్ధానం గోశాలలో 1350కి పైగా గోవులున్నాయి వీటిఆలనా పాలనా చూసుకొనుటకు తగిన సిబ్బంది ఉన్నారు, చిరుత పులి ఆకలి తీర్చుకొనుటకు గోశాలపై దాడిచేయసాగింది, చిరుతపులి గోశాలకున్న ప్రహరీగోడను దాటి లోపలికి ప్రవేశించి గోవులపై దాడిచేసి తినడం మరిగింది, ఈ విషయం తెలిసిన దేవస్ధానం ప్రహరీగోడను ఎంతు పెంచడంలో విఫలమైందని చెప్పుకోవడంలో సందేహంలేదు. దేవస్ధానంలో 155 మంది ప్రవేటు సెక్యూరిటి,40 మందికి పైగా హోంగార్డు లు, వీరందరిపై పర్యవేక్షణకు దేవస్ధానం ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను నియమించి, సీసీ కెమెరాలు 350కిపైగా క్షేత్ర మంతటా అమర్చింది, సీసీ కెమెరాలద్వారా క్షేత్రాన్ని తిలకించేందుకు సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అందులో నైపుణ్యం కల్గిన పర్యవేక్షకులను నియమించింది, నిత్యం క్షేత్రపరిధిలో చీవ చిటుక్కు మన్నా తెలిసేవిధంగా అవకాశాలున్నా నిరుపయోగంగా పాలనసాగుతుందా అనేవిధంగా దేవస్ధానంతీరుందని భక్తులారోపిస్తున్నారు. గోశాలలో సీసీ కెమెరాలున్నాయా, ఉంటే పనిచేయటంలేదా, చేస్తే గోవులపై చిరుత దాడిని తిలకించలేదా, తిలకించియున్నా అధికారులకు తెలపలేదా, తెలిపినా అధికారులు గో రక్షణపట్ల స్పందన కరువైందా అనే మాటలు ఊరంతా వినిపిస్తున్నాయి. గడిచిన వారంలో చిరుతపులి గోశాల ప్రహరీగోడను దాటి గోవులపై దాడి చేసి గోవులను చంపి తిని వెలుతుంటే దేవస్ధానం అధికారులు ప్రహరీగోడను ఎత్తు పెంచి తగిన బద్రత కల్పించడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు , దేవస్ధానంలో గోశాలలో గోవులపై చిరుతపులి దాడిచేస్తే పట్టించుకోలేదు దేవస్ధానం , భక్తులపై అల్లరిమూకలు దాడిచేస్తే పట్టించుకోలేదు దేవస్ధానం. లోపం ఎక్కడ ఉంది దేవస్ధానం లోపమా, క్షేత్రపాలకులుగా రక్షకులుగా ఎంతమంది సెక్యూరిటి ఉండి ఏమిలాభం, ఎన్ని సీసీ కెమెరాలు ఉండి ఏమిలాభం అని స్ధానిక భక్తులనుకుంటున్నారు. గోశాలలో గోవులు మనోవేదనకు గురిచెందుతున్నారు, మాకు సరైన పోషనలేదని, మమ్ములను రక్షించే వారేలేరని.? మాప్రాణాలకు రక్షణకరువైందని, మమ్ముల్నడ్డు పెట్టుకొని గోనిధి సేకరిస్తున్నారు, గోమయంతో గో విభూదిని అమ్ముకుంటున్నారు, గో పిడకలమ్ముకుంటున్నారు,గో.మూత్రమమ్ముకుంటున్నారు, స్వామి అమ్మవార్లనిత్యాభిషేకాలకు మా క్షేరాన్నివాడుతారు,నైవేద్యాలకువాడుతారు మానుంచి ఎన్ని ఉపయోగాలున్నా మాకు సరైన రక్షణలేదని గోవులు,గోసంతతి అవేధన చెందుతున్నాయి, మమ్ములను వాడుకోవడంకాదు మమ్ములను రక్షించండి అని గోవుల గోషిస్తున్నాయి.?

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!