
ఈనెల 29న జాతీయ క్రీడ దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల జిల్లాలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు
జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ ఎం ఎన్ వి రాజు
నంద్యాల తెలుగు వార్త స్పోర్ట్స్ న్యూస్ :- నంద్యాల పట్టణం డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ ఎం ఎన్ వి రాజు గారు మాట్లాడుతూ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల జిల్లా క్రీడా అధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధ్యక్షులు ఎం ఎన్ వి రాజు తెలిపారు, నంద్యాల జిల్లా స్థాయిలో వాలీబాల్, బాల్ బ్యాట్మెంటన్, ఫుట్బాల్,హాకీ మరియు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, పోటీలలో పాల్గొనే జట్లు తమ ఎంట్రీలను 25వ తేదీ ఉదయం 9 గంటల లోపు నమోదు చేసుకోవలసినదిగా నంద్యాల జిల్లా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ రాజు గారు తెలిపారు,
*క్రీడా పుష్కరాలు* :- నంద్యాల జిల్లా గత ఏడాది ఏప్రిల్ నుండి మార్చి 31వ తేదీ 2022 తేదీ వరకు అంతర్జాతీయ మరియు జాతీయ సర్టిఫికెట్లను డి ఎస్ ఏ స్పోర్ట్స్ ఆఫీస్ నందు అందజేయవలసిందిగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ రాజు గారు తెలిపారు,