
నీటి ఎద్దడి ఏర్పడకుండా నివారణ చర్యలు చేపట్టిన ఎంపీడీవో మోహన్ కుమార్
=================================
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు రూరల్.
ఆత్మకూరు మండల పరిధిలోని బైర్లూటి గ్రామమునందు వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీవో మోహన్ కుమార్ తెలియజేశారు. బుధవారం ఉదయం బైర్లూటి గ్రామమునందు బోర్లను, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని మండలంలోని అన్ని గ్రామాలలో నీటి సమస్య రాకుండా చూడాలని మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సూచనల మేరకు అన్ని గ్రామాలలో నీటి వనరుల వివరాలను సేకరించడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో పాడైపోయిన బోర్లను మరమ్మతులు చేయిస్తున్నామని తెలియజేశారు. దీనికి సంబంధించి అన్ని గ్రామాల సర్పంచులకు గ్రామ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమము నందు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్, బైర్లూటి గ్రామ సర్పంచ్ గురువమ్మ, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.