జోహా హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
తెలుగు వార్త న్యూస్

ఆత్మకూరు పట్టణంలో… నూతన జోహా హాస్పిటల్ ప్రారంభించిన: ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.
================================
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ కాలనీ లో సోమవారం నాడు జోహా నూతన హాస్పిటల్ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన డాక్టర్ లతో హాస్పిటల్ నందు బిపిని చెక్ చేయించుకున్నాను. నిరుపేదల దృష్టిలో ఉంచుకొని అది తక్కువ ధరకే చికిత్స అందిస్తామని హాస్పిటల్ నిర్వాహకులు తెలియజేశారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆత్మకూరు మండల పరిసరాలలోని వివిధ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు తక్కువ రేట్లకే అందించాలని సూచించారు. తదనంతరం ఆయన భారీ కేకును కట్ చేసి హాస్పటల్ నిర్వాహకులను అభినందించారు. హాస్పటల్ లో అన్ని రకాల టెస్టుల చేసుకోవటం ల్యాబ్ సదుపాయం ఉందని తెలియజేస్తూ, దీన్ని గుర్తించి మండల ప్రాంతంలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.