BREAKING NEWSBUSINESSMOVIESPOLITICSSTATEWORLD

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి..

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి..
కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టిఆర్ఎస్ నాయకులు…
రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు టిఆర్ఎస్ కార్యకర్తలు…
కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ డిమాండ్..
కామారెడ్డి, మార్చి 24, (తెలుగు వార్త న్యూస్) :
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సత్య కన్వేన్షన్ హాల్ లో TRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అనంతరం పేట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ ధర్నా.
 పెరిగిన ధరలు వెంటనే తగ్గించాలి – కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరియు కామారెడ్డి జిల్లా TRS పార్టీ అధ్యక్షులు యంకె.ముజిబొద్దీన్ కేంద్రం పెంచిన గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు ఉపసంహరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా  నిజాంసాగర్ చౌరస్తా లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన మరియు వంట వార్పు నిర్వహించి ధర్నా చెప్పటారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరియు TRS పార్టీ జిల్లా అధ్యక్షులు యంకె. ముజిబొద్దీన్ గారు మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగిపోవడం వలన సాధారణ రవాణా నిలిచిపోతుందని అన్నారు. ఆటోలు, బైక్‌లు నడుపుకోలేని పరిస్థితి వచ్చిం దని, ఇండ్లల్లో గ్యాస్‌ బండ మోయలేని భారంగా ఉందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే గ్యాస్‌ బండపై రూ.50, పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు 90 పైసలు చొప్పున పెంచారని విమర్శించారు. ధరలు తగ్గించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, ZP వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, IDCMS వైస్ చైర్మన్ ఇంద్రాసేనారెడ్డి, MPP, ZPTC, పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, MPTC, సింగిల్ విండో చైర్మన్ లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!