
భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నతుడు అంబేద్కర్
అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
తెలుగు వార్త న్యూస్:సత్యవేడు
భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. గురువారం 131వ జయంతిని పురస్కరించుకుని సత్యవేడు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పునర్నిర్మించిన నూతన అంబేద్కర్ విగ్రహానికి ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా అంబేద్కర్ ఎస్సి సంక్షేమ అసోసియేషన్ అధ్యక్షులు బందెల బాలయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘసంస్కర్త అన్నారు. ముఖ్యంగా దళితుల సామాజిక రాజకీయ హక్కులకోసం ఎనలేని సేవలు అందించినట్లు ఆయన చెప్పారు. కుల నిర్మూలన,అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందన్నారు.కేవలం దళితులకే గాక అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక చైతన్యం తీసుకురావడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది మొదటి స్థానం అని గుర్తు చేశారు.నాడు భారత రాజ్యాంగంలో దళితులకు అనేక హక్కులు కల్పించడంతోపాటు రిజర్వేషన్లు తీసుకు రావడం వల్లే నేడు రాజకీయంగా,ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత పదవుల్లో దళితులు ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అనగారిన వర్గాల అందరూ రాజకీయంగా ఆర్థికంగా ఉన్నతి సాధిస్తున్నరు అంటే కేవలం రాజ్యాంగ రచనలో బిఆర్ అంబేద్కర్ చూపిన ముందుచూపు మాత్రమేనన్నారు.అందువల్ల అంబేద్కర్ జయంతి,వర్ధంతి ఉత్సవాలను ప్రతి పంచాయతీలోనూ పండుగ వాతావరణం నెలకొనేలా నిర్వహించాలన్నారు.ప్రధానంగా ఎస్సీ,ఎస్టీలు సర్పంచులుగా,ఎంపిటిసిలుగా పదవుల్లో కొలువు తీరారంటే కేవలం అంబేద్కర్ పెట్టిన భిక్షం మాత్రమే అన్నారు.అందుకని పంచాయతీ పరిధిలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించాలని ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులను కోరారు. అంబేద్కర్ జయంతి రోజున న్యాయశాస్త్ర కోవిదులు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను స్మరించుకోవడం ప్రతి ఒక్కరు పై ఉన్నట్టు కొల్లడం వైఎస్ఆర్ సీపీ నేత రమణ గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఐక్యంగా అందరము కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.అంబేద్కర్ జీవిత చరిత్ర విశేషాలను పాఠ్యాంశాలలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అంబేద్కర్ జీవిత పాఠాలను పాఠ్యాంశంలో చేర్చడం జరిగింది అన్నారు. అలాగే రాష్ట్రంలోనే దళితవాడలను అంబేద్కర్ కాలనీలుగా పేరు మార్చడానికి రాబోయే అసెంబ్లీలో దీనిపై ప్రస్తావించాలి అని ఆయన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు విజ్ఞప్తి చేశారు. అంతకుమునుపు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి,జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు బిరేంద్ర వర్మ,సింగిల్విండో అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి,రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బాలాజీ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,రమేష్, మండల కో ఆప్షన్ సభ్యులు మస్తానమ్మ తదితరులతో కలసి ఎమ్మెల్యే ఆదిమూలం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం డప్పు వాయిద్యాల మధ్య ర్యాలీగా బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. తదనంతరం పునర్నిర్మించిన నూతన అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవంలో శిలాఫలకం ఆవిష్కరించి పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది.కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే ఆదిమూలపు కేకును కట్ చేసి అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, అధికారులకు, నేతలకు పంచి పెట్టడం జరిగింది.ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం పలువురికి అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో సీఐ శివ కుమార్ రెడ్డి,ఎస్ఐలు పురుషోత్తం రెడ్డి,వీరాంజనేయులు,తహశీల్దారు సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో అరుణమ్మ, ఉపాధి ఏపీవో భాస్కర్ అయ్యా,ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అనిల్కుమార్,ఎంపిటిసిలు షీలా,సరవన,సర్పంచులు మధురాజు,శేఖర్, గోవింద స్వామి,రూబెన్,అంబేద్కర్ ఎస్సి వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చెల్లయ్య, మాణిక్యం,రవి,సెక్రటరీ జోసెఫ్,కె.వి.రమణ,రాబర్ట్,అరుణ్, కోఆర్డినేటర్ దామోదరం,వైఎస్ఆర్ సీపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి,సన్నాసయ్య,శ్రీరాములు రెడ్డి,గోవిందస్వామి,పలువురు పురప్రజలు తదితరులు పాల్గొన్నారు.