
రుద్రవరం ఆదర్శ పాఠశాలలో చేరుటకు దరఖాస్తులకు 16 వరకు గడువు
తెలుగు వార్త :
రుద్రవరం:ఆదర్శ పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ఆరు మరియు ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తులు 16 వ తేదీ వరకు చేసుకోవచ్చు అని ఒక ప్రకటన లో ప్రిన్సిపాల్ శ్రీ సంగెపు నాగేశ్వర రావు తెలిపారు.చేరాలి అనుకునే వారు
apms.ap.gov.in సైట్ లో నమోదు చేసుకోవాలి అని అన్నారు.విద్యార్థి అర్హతను బట్టి క్రెడిట్ , డెబిట్ కార్డుల ద్వారా రుసుము చెల్లించి చెల్లింపు ప్రతి, ఆన్లైన్లో దరఖాస్తు చేసిన నకలు , విద్యార్థి , తల్లిదండ్రుల ఆధార్ కార్డులు , రేషన్ కార్డు , స్టడీ సర్టిఫికెట్లను దరఖాస్తుకు జత చేసి మన ప పాఠశాలలో జిరాక్స్ కాపీలు అందించాలి అని అన్నారు.ఆరో తరగతి చేరాలి అనే విద్యార్థులకు మన జిల్లా విద్యాధికారి పర్యవేక్షణలో కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్దతిలో ఎంపిక చేయనున్నారు.లోకల్ విద్యార్థులకే ప్రాధాన్యంఆదర్శ పాఠశాల రుద్రవరం చేరాలనుకునే వారు స్థానిక విద్యార్థులై ఉండాలి.గడువు 16 వరకు మాత్రమే ఉన్నది అని అన్నారు.