ANDHRABREAKING NEWS

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్

తెలుగు వార్త జూలై 21. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి డిజిపి ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) ఆదేశించారు. మంచిర్యాల జోన్ చెన్నూర్ మండలం, బతుకమ్మ వాగు వంతన సైడ్ వాల్ మరమ్మత్తు పనులు, కోటపల్లి మండలం లోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్, అన్నారం సరస్వతి బ్యారేజ్ లను సందర్శించి ప్రాణహీత వరద ఉదృతి ని పరిశీలించారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ముందస్తుగా తరలించాలని అన్నారు. పట్టణంలోని చెరువులు, వివిధ ప్రాజెక్టుల కాల్వలు నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించి, నిఘా ఉంచాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీపీ అధికారులను ఆదేశించారు.

సీపీ వెంట మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపిఎస్., జైపూర్ ఏసీపీ మోహన్, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసు దేవారావు, చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యా సాగర్, కోటపల్లి ఎస్ఐ సురేష్, తదితరులు ఉన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!
20:56