ANDHRABREAKING NEWS

అమలాపురం గూడెం లో సుందరయ్య 37 వర్ధంతి వేడుకలు

తెలుగు వార్త

అమలాపురం గూడెం లో సుందరయ్య 37 వర్ధంతి వేడుకలు

================================

తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు రూరర్

 

సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 37 వర్ధంతి సందర్బంగా అమలాపురం గూడెం లో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లులు అర్పించారు. సోషలిస్టు భవిష్యత్తు అనే అంశంపైన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మండల కార్యదర్శి నరసింహ నాయక్ మాట్లాడుతూ కుల వ్యవస్థను నిరసించిన సుందరయ్య అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి అని రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్నారన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శ జీవితాన్ని గడిపారన్నారు. స్వాతంత్ర సమరంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘకాలం పని చేశారని, ఆ సమయంలో పార్లమెంట్ కు కూడా సైకిల్ పై వెళ్లేవారని తెలిపారు. ఆరేళ్ల వయసులోనే తండ్రి మరణించారని, ప్రాథమిక విద్యను వీధి బడిలోనే పూర్తి చేశారన్నారు. దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను పార్టీ కేంద్ర కమిటీ సుందరయ్య కు అప్పగించిందన్నారు. నేటి తరంవారు పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల నాయకులు సుధాకర్, బాబు, కె వెంకటేశ్వర్లు, వీరన్న, మూగేన్న, బయన్న, గురువయ్య, నాగన్న, గంగమ్మ శివమ్మ నూర్జహాన్ రాజమ్మ మూగేమ్మ గణేష, జయపాల్, యోహాన్, లింగమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!