ANDHRABREAKING NEWS

విద్యుత్ తీగల తో పొంచి ఉన్న ప్రమాదం

భయం గుప్పెట్లో ప్రయాణికులు.

విద్యుత్ తీగల తో పొంచి ఉన్న ప్రమాదం… భయం గుప్పెట్లో ప్రయాణికులు.

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు.

తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కురుకుంద గ్రామం వెళ్లేదారిలో గాలివానకు చెట్లు విరిగి విద్యుత్ తీగల భయపడి ప్రమాదం పొంచి ఉంది. రెండు రోజులు అయినప్పటికీ ఇంతవరకు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో, ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకువస్తుందని తెలియక కురుకుంద,కొట్టాల చెరువు గ్రామానికి వెళ్ళే ప్రజలు క్షణం క్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. రోడ్డుపై నడిచే వారిపైన, ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్స్ ప్రయాణికులు విద్యుత్ తీగలు కిందపడి ప్రాణాలు పోతాయని భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణిస్తూన్నమని తెలిపారు. విద్యుత్ అధికారుల తీరు భయం గోల్పుతుంది. ప్రాణాలతో తమకేం పని లేనట్లుగా ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ ప్రమాదకరంగా తయారైందన్నారు. ఆత్మకూరు పట్టణానికి చివర్లో కురుకుంద రోడ్డు రాజారావు మామిడి తోట సమీపంలో విద్యుత్ తీగలపై గాలివానకు చెట్లు విరిగిపడడం ప్రమాదం గా ఉందని, ఇంతవరకు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి చెట్లు తొలగించి ప్రమాదాన్ని అరికట్టాలని కోరారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!