ANDHRABREAKING NEWS

టిడిపి జెండా బీసీలకు అండ

బిసి సెల్ తాలూక నేత గా శీలం లక్ష్మి ప్రసాద్

టిడిపి జెండా బీసీలకు అండ

 

బిసి సెల్ తాలూక నేత గా శీలం లక్ష్మి ప్రసాద్

తెలుగు వార్త :

శిరివెళ్ల (యర్రగుంట్ల) : బీసీ సామాజిక వర్గానికి చెందిన పేదలు అట్టడుగు వర్గాలను సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్య తీసుకురావాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీ జండా తోనే సాధ్యమని ఆళ్లగడ్డ నియోజకవర్గ బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శీలం లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు.

 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఇతర నేతల సమక్షంలో బీసీ సెల్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా శీలం లక్ష్మీ ప్రసాద్ ను ఆదివారం శ్రీరామ నవమి రోజున ఏకగ్రీవంగా ఎన్నికఅయ్యారు.

 

అనంతరం లక్ష్మి ప్రసాద్ శిరివెళ్ల మండలం యర్రగుంట్ల మేజర్ పంచాయతీ గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ సామాజిక పేదల అభివృద్ధి సంక్షేమం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమన్నారు.

 

రైతులకు కూలీలకు కార్మికులకు అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని గిట్టుబాటు ధర కల్పించకుండా అన్నివిధాలుగా వైసిపి ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్‌ , పెట్రోల్‌ను అధికంగా పెంచి ప్రజల నడ్డివిరిచి నట్టేట ముంచే విధానాలను తీసుకువచ్చిందనీ శీలం లక్ష్మీ ప్రసాద్ మండిపడ్డారు.

 

ఇనుము ఇసుక రాయి కర్ణాటక సిమెంట్ తదితర భవన నిర్మాణ సామాగ్రి పేదలు కొనలేనంత అధిక ధరలు ఆకాశాన్ని తాకినట్లు పేర్కొన్నారు.

 

రాబోయే రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో అధిక ధరలు వ్యవసాయం, ప్రజాసమస్యలపై ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వివరించారు.

 

ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గారికి మరియు యువ నేత భూమా జగద్విఖ్యాత రెడ్డి గారికి సిరివెళ్ల మండల టిడిపి కన్వీనర్ కాటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి శీలం లక్ష్మీప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!