యువ నేస్తం పథకం అమలుపరచి నిరుద్యోగ భృతి ఇవ్వాలి :
తెలుగుయువత నాయకులు పస్పిల్ మున్నా

యువ నేస్తం పథకం అమలుపరచి నిరుద్యోగ భృతి ఇవ్వాలి : తెలుగుయువత నాయకులు పస్పిల్ మున్నా
తెలుగు వార్త :
ఆత్మకూరు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన
యువ నేస్తం పథకం అమలు పరచి నిరుద్యోగ పట్టభద్రులకు ఆసరాగా నిలవాలని తెలుగుయువత నాయకులు పస్పిల్ మున్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మున్నా మాట్లాడుతూ
యువ నేస్తం పథకం అమలు పరచి నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలు ఇవ్వాలని కోరారు గతంలో వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ఇంటికో ఉద్యోగం లేక ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలన్నారు ,కేరళ ,పశ్చిమ బెంగాల్,ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో
లో పదో తరగతి పాస్ అయిన వారి నుంచి పీజీ ఉత్తీర్ణులైన వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తున్నారని మన రాష్ట్రంలో కూడా ఆ విధానాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.84 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు,గతంలో సీఎం,జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2.30 లక్షల ఉద్యోగాలు అన్నింటిని
భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు జాబ్ క్యాలెండర్ కు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని, కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ యువతను ఆదుకోవాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు
ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తుందని గత ప్రభుత్వంలో ముస్లింలకు చంద్రబాబు గారు రంజాన్ తోఫా ఇచ్చేవారని గుర్తు చేశారు, జగన్ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు
రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధం తో బుద్ది చెప్పాలన్నారు
,ఈ కార్యక్రమంలో హాజి,భాస్కర్,సయ్యద్ పాల్గొన్నారు