బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం
పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.
===============================
తెలుగు వార్త న్యూస్ : పాములపాడు
నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి ఉత్సవాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ కాలనీలలో ర్యాలీ చేశారు.అనంతరం నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టిన గొప్ప మహనీయుడు అని, అలాంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు అబ్రహం,జిల్లా కార్యదర్శి అంకన్న, సహాయ కార్యదర్శి యమ్మని శివన్న, కొత్తపల్లి మండలం మాల మహానాడు మండల అధ్యక్షుడు గూడెం సురేష్,నాగన్న,నాగరాజు, మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.