ANDHRABREAKING NEWS

పర్యాటకరంగ అభివృద్ధికి కృషి చేయండి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

తెలుగు వార్త.
నంద్యాల జిల్లా న్యూస్
తేదీ: 28-12-2024,
జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యాటక మండలి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. జిల్లా టూరిజం అధికారి సత్యనారాయణమూర్తి, ఏపీటీడీసీ డివియం చంద్రమౌళి, డిఈ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ సుబ్బరాయుడు, జిల్లా ఫారెస్ట్ అధికారి నాగమునేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా సంత జూటూరును టూరిజం సర్క్యూట్ గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులను ఆదేశించారు. సంత జూటూరు నుండి ఓంకారం, వైయస్సార్ స్మృతి వనం, నంద్యాల జిల్లాను కలుపుతూ టూరిజం సర్క్యూట్ గా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవుకు బోటింగ్, రెస్టారెంట్ నిర్వహణకు టెండర్లు పిలిచి ఖరారు చేయాలన్నారు. నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు పాత బకాయిల వసూళ్లకు చివరిసారిగా నోటీసులు ఇచ్చి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులలో బోట్లలో ప్రయాణానికి సంబంధించి తొమ్మిది రకాల అనుమతులు తీసుకోవాలని సంబంధిత అంశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. సిద్దేశ్వరం నుండి సోమశిల సింగోటం జాతరకు బోట్లలో వెళ్తున్నారని అనుమతులు లేని బోట్లలో ప్రయాణం చేస్తే ప్రమాదాలకు గురయ్యే అవకాశం వుందని సంబంధిత నిర్వాహకులను హెచ్చరించాలన్నారు. బిల స్వర్గం, వాల్మీకి గుహలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఏపీ టీడీసిఅధికారులు ఆదేశించారు. ప్రతి టూరిజం ప్రదేశాలలో గిరిజనుల ఉత్పత్తుల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఏడు టూరిజం సర్క్యూట్ డెస్టినేషన్ లను వెబ్సైట్లో ఏపీటీడీసీ లింకుతో అనుసంధానం చేయాలన్నారు. గండికోట, అహోబిలం, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ లో టూరిజం సర్క్యూట్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!