ANDHRABREAKING NEWS

కారుణ్య నియామకం కింద గ్రామ సచివాలయం జూనియర్ లైన్ మెన్ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని కోరిన ఆత్మకూరు జేఏసీ కమిటీ 

తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.

కారుణ్య నియామకం కింద గ్రామ సచివాలయం జూనియర్ లైన్ మెన్ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని కోరిన ఆత్మకూరు జేఏసీ కమిటీ

==============================

తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.

 

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం లోని సిద్దాపురం గ్రామం సచివాలయం పరిధిలో బైర్లూటి గ్రామంలో సచివాలయం జూనియర్ లైన్ మెన్ శ్రవణ్ కుమార్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై గురువారం నాడు మరణించారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించే అటువంటివారు. కుటుంబాన్ని పోషించే శ్రావణ్ కుమార్ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. మృతుడు శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆత్మకూరు మండల గ్రామ సచివాలయం జేఏసీ మండల అభివృద్ధి అధికారి మోహన్ కుమార్ మరియు విద్యుత్ సబ్ స్టేషన్ ఏడి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామ సచివాలయం జేఏసీ కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ… గ్రామ సచివాలయం జూనియర్ లైన్ మెన్ మరణించడం చాలా దురదృష్టకరం అన్నారు. మృతుడి యొక్క కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కల్పించాలని అధికారులను కోరారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం నందు గ్రామ సచివాలయం ఉద్యోగులు మునవర్ భాష, షఫీఉల్లా, రవి, ప్రేమ్ కుమార్, మాలిక్ భాష, రాఘవేంద్ర,శివకుమార్, అరవిందు, చాణిక్య, ఎమ్మెల్యే ఎంల్ఒ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!