
ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల దగ్గరకుచేరేందుకు వాలెంటర్ల్లు సచివాలయ సిబ్బంది కృషి.
ప్రజలకు సేవలు అందించడమే మీ ద్యేయం.
తెలుగు వర్త
సిరివెళ్ల,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను తీసుకరావడం జరిగిందని వాలంటీర్లు ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించడమే ద్యేయంగా పని చేయాలని ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సన్మానసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దూదేకుల హుస్సేన్ బి గుర్రప్ప మాట్లాడు తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆళ్లగడ్డ తాలూకాలో మొట్టమొదటిసారిగా సిమెంట్ రోడ్డు వేసిన ఘనత మన మన గ్రామానికి దక్కిందని గ్రామ సర్పంచ్ హుస్సేన్ బి గుర్రప్ప అన్నారు. గత ప్రభుత్వంలో పింఛన్లు గాని తదితర ప్రభుత్వ పథకాలు కంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలలో మన గ్రామం ఎంతో ముందంజలో ఉందని అన్నారు. అదేవిధంగా మన గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మన గ్రామంలోనే ప్రథమంగా సిమెంటు రోడ్డు వేయడం మన గ్రామానికి గర్వకారణమన్నారు గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం లోనే అధికశాతం పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు కొన్ని కారణాల వల్ల కొంతమందికి పి క్షన్ రాకపోవడం జరిగిందని వాటిని మన ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నాడు. ఇంకనూ కొన్ని సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని గ్రామ సర్పంచ్ హుస్సేన్ బి గుర్రప్పఅన్నారు. అనంతరం వాలెంటర్లక, సచివాలయం సిబ్బందికి సన్మాన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బిజేంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తారీకు వచ్చిన వెంటనే వాలంటరీ వ్యవస్థ ఇన్ ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తూ ఉన్నారని అదే గత ప్రభుత్వంలో సర్వర్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు అన్నారు ఈ ప్రభుత్వంలో లో జగన్ అన్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు చేరవేస్తుంది అని వారు తెలిపారు