
పెరటి పంట.ఆరోగ్యం మన ఇంట
ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లో తప్పనిసరిగా పెరటి తోట సాగు చేసుకోవాలని
*తెలుగు వార్త న్యూస్: వరదయ్యపాలెం*
స్వచ్ఛత్ రూరల్ & అర్బన్ డెవలప్ మెంట్ సొసైటి అధ్యక్షులు మావుడూరు మోహన్ సూచించారు..
మండలంలోని రాజగోపాలపురంలో శుక్రవారం పెరటి తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం సేంద్రియ విధానంలో ఇంటి వద్దనే ఆకుకూరల సాగు చేసుకోవడం ఉత్తమమని తెలిపారు. అనంతరం గ్రామస్తులకు తోట కూర , గోంగూర , పాల కూర ,కాకర , బీర,మునగ , అశ్వగంధ, మిరప,తదితర విత్తనాలను ఉచితంగాఅందించారు.
కార్యక్రమంలో ,పంచాయతీ సెక్రటరీ, రజిత అగ్రికల్చర్ అసిస్టెంట్ ,మదన్ మోహన్ ,వార్డు నెంబర్ లు, వలంటీర్లు పాల్గొన్నారు.