ANDHRABREAKING NEWS

ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయిలో కి వెళ్ళాలి

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తొగురు

ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయిలో కి వెళ్ళాలి
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తొగురు

 

తెలుగు వార్త :
నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలోని బాలయోగి మహిళా గురుకులంలోని విద్యార్థులకు నీటి దాహార్తికి ఇబ్బందిగా ఉందని తెలుసుకొని తక్షణమే స్పందించి అక్కడ వారికి త్రాగునీటి సౌకర్యం కల్పించినా ఎమ్మెల్యే ఆర్థర్ తొగురు గారు తన చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి తాగునీటి వసతి కల్పించారు అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడుతూ ప్రస్తుతం జగనన్న ప్రభుత్వం పేదవారికి చదువుకోడానికి అన్ని వసతులు కల్పిస్తుందని మరియు మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చి విద్యా రంగంలో పెను మార్పులు తీసుకొని వచ్చారు ఇటువంటి సదుపాయాలను ఉపయోగించుకుని ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత పదవులు పొంది మన జిల్లాకు అధికారిగా రావాలని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇది తన కోరిక అని ఎమ్మెల్యే ఆర్థర్ అన్నరు
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మండలి అధ్యక్షుడు వంగాల భరత్ రెడ్డి పాములపాడు మండల వైసిపి నాయకులు రామలింగేశ్వర రెడ్డి వేల్పుల నాగన్న గోకవరం సర్పంచ్ మారన్న నందికొట్కూరు వైసిపి నాయకులు విక్టర్ ,దామర గట్ల రత్నమయ్య, కొత్తపల్లి సింగరపల్లి సాయిరాం గురుకులం ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!