
దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు
తెలుగు వార్త :
నంద్యాలలోని అరటి పండ్ల వ్యాపారి బాల వెంకట రెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల విశ్వ నగర్ ఆర్చి ఎదురుగా ఉన్న కరెంట్ ఆఫీస్ పక్కన ఎండాకాలంలో ప్రజల దాహం తీర్చడానికి దాతల సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
“ఈ చలివేంద్రాన్నికి విశ్వ నగర్ లో ఉన్న ఇంటి నిర్మాణం మేస్త్రి ప్రసాద్, నూనెపల్లె బ్రిడ్జి దగ్గర ఉన్న దినేష్ పాల కేంద్రం వ్యాపారి సాములు, అరటి పండ్ల వ్యాపారి బాల వెంకటరెడ్డి ఆర్థికంగా సహకరించి ప్రజల దాహం తీర్చడానికి చలివేంద్రం ను ఏర్పాటు చేశారు.
ఈ చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమంలో “మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి, సభ్యుడు హుస్సేన్ వలి, శ్రీను పాల్గొన్నారు.”