
పెద్దఈటిపాకం సత్రంలో నూతన బోరు ఏర్పాటు.
తెలుగు వార్త న్యూస్:సత్యవేడు
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం పెద్దఈటి పాకం పంచాయతీ సత్రం గ్రామంలో నూతన బోరు ఏర్పాటుకు సంబంధించి స్థానిక జెడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి బోరింగ్ డ్రిల్కు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.పెద్దఈటిపాకం గ్రామ సర్పంచ్ రూబెన్ ఆధ్వర్యంలో శనివారం సత్రం గ్రామం వద్ద శాస్త్రోక్తంగా పూజలు జరిపి జెడ్ పి టి సి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి బోరింగ్ను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో కొత్తగా వేసిన బోర్లో రెండు అంగుళాల జలం పుష్కలంగా లభించింది.ఈ సందర్భంగా జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సత్రం గ్రామంలో తాగునీటి ఎద్దడి తరచూ తలెత్తుతున్నటు చెప్పారు. ప్రస్తుతం పెద్ద ఈ టి పాకం గ్రామం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్రం గ్రామానికి పంచాయతీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు.కానీ శాశ్వతంగా తాగునీటి ఎద్దడి నివారించడానికి నూతన బోరు ఏర్పాటుకు జడ్పీ ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు ఆమె పేర్కొన్నారు.ఇందులో భాగంగానే సత్రంలో నూతన బోరు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.బోర్లో కూడా జలం పుష్కలంగా లభించడంతో ఒకటి రెండు రోజుల్లోనే మోటారు ఏర్పాటు చేసి గ్రామానికి తాగునీటి సరఫరా చేయనున్నట్టు ఆమె చెప్పారు.దీంతో సత్రం గ్రామస్తులకు భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి ఉండదన్నారు.45 కుటుంబాలు నివసిస్తున్న సత్రంలో నూతన బోర్డు ఏర్పాటు చేసి తాగునీటి కొరత తీర్చినందుకు ఈ సందర్భంగా జెడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డికి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకు సత్రం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సెల్వి రమణ,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గిరీష్ కుమార్, పంచాయతీ సెక్రెటరీ జలజ శ్రీ పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.