పాలక ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న

పాలక ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న భారాలను ఖండించండి సిపిఎం
తెలుగు వార్త :
ఆత్మకూరు: దేశంలో నేడు పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఏసురత్నం పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్ లు అన్నారు సోమవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ గౌడ్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ చంద్రుడు దినదిన ప్రవర్థమానమౌతాడు కాని ధరలు మాత్రం 24గంటలు దాటకముందే పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరిగి నేడు పెట్రోల్ డీజిల్ ధరలు రూ.120 వరకు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు పండుగల సందర్భంగా ప్రయాణాలు మరింత ప్రియం కానున్నాయి. వీటితోపాటు వంటగ్యాస్ సిలిండర్ మీద కూడా ఒకేసారి రూ. 15 పెంచారు అది వెయ్యి రూపాయలు అయింది ధరలు పెరగడం వల్ల ప్రజా రవాణా ఖరీదువుతుంది. సరుకుల రవాణా ఛార్జీలు పెరగడం వల్ల వీటి ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా అన్ని ఖర్చులు పెరిగి పోతాయి ఇప్పటికే కరోన పుణ్యాన ఆదాయాలు ఉపాధి తగ్గాయి పేదరికం పెరిగింది పోషకాహారం లేమి పెరుగుతుంది. ధరలను అదుపులో ఉంచాల్సిన ప్రభుత్వం ధరలు పెరగడానికి కారణాలు చెప్తూ పోతే పరిష్కరించడానికి చొరవ చూపకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతోంది ప్రభుత్వాలు ప్రజల కోణ్ణం నుంచి ఆలోచిస్తే ప్రగతి సాధ్యమవుతుందని సిపిఎం పార్టీ గా వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు స్వాములు రామ్ నాయక్ రోషన్ వలి వెంకటేశ్వర్లు సుధాకర్ మా బాషా, పాల శివుడు సద్దాం హుస్సేన్ సా రాజు సురేంద్ర, రవి సుబ్బయ్య నూర్ షాషా మల్లయ్య విజయ్ తదితరులు పాల్గొన్నారు