
సీఎం జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పాకి మా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి అంటున్న ప్రజలు.
20వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 20వ రోజుకు చేరుకుంది. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని లక్ష్మీ నగర్ సచివాలయం 2 పరిధిలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి అందించాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ఆత్మకూరు లోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి మూడేళ్ల కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ది గురించి వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులు ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు పరచడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రజల చెప్పడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఆత్మకూరు పట్టణంలో పలు వార్డుల్లో ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. వార్డులలో కొన్ని సమస్యలను సంబంధిత అధికారులను ఆదేశిస్తూ వెంటనే పరిష్కారమార్గం చూపిస్తున్నారు. వార్డులలో మహిళలు హారతులతో పూలను వెదజల్లుతూ స్వాగతం పలుకుతున్నారు.సీఎం జగన్ ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ప్రజల యోగక్షేమాలను అడుగు తెలుసుకుంటూ గడపగడపకు వెళుతున్నారు. ఈ కార్యక్రమం నందు ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా, వైసిపి పట్టణ అధ్యక్షులు షేక్ స్టేట్ డైరెక్టర్ అంజద్ అలీ, వైసిపి నాయకులు పువ్వాడి భాస్కర్, మునిసిపల్ కో-ఆప్షన్ మెంబర్ యం. ఏ. రషీద్, సింగిల్విండో చైర్మన్ సురేష్, వార్డ్ కౌన్సిలర్ లు వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.