
ఓ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక 14వ వార్డు నందు ఆదివారం నాడు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుందని మళ్లీ రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శిల్పచక్రపాణి రెడ్డిని , రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడపగడపకు అన్ని ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గూడు నీడ ఎలాంటి ఆసరా లేనటువంటి అవి నిరుపేద కుటుంబాన్ని చూసి చలించిపోయారు. వ్యక్తిగతంగా కొంత నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఆ నిరుపేద కుటుంబానికి పక్కా గృహాన్ని మంజూరయ్యే విధంగా విఆర్వో తో మాట్లాడి వారి పేర్లను నమోదు చేయించారు. గృహం నిర్మించుకోవాలని కుటుంబానికి సూచించారు. ఏదైనా ఆర్థికంగా అవసరం ఉంటే వ్యక్తిగతంగా గృహం నిర్మించుకునేటప్పుడు సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆ నిరుపేద కుటుంబం మా గురించి ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు మారిపోయినప్పటికీ పట్టించుకునే నాధుడేలేడని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాపై ప్రత్యేక శ్రద్ధ చూపించి గూడు నీడలేని మాకు గూడును కల్పిస్తానని హామీ ఇచ్చినందుకు, ఆర్థిక సహాయం చేసినందుకు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.