ANDHRAPOLITICS

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సహకారంతో దివ్యాంగుల పెన్షన్ మంజూరు

తెలుగు వార్త

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సహకారంతో దివ్యాంగుల పెన్షన్ మంజూరు…షేక్ స్టేట్ డైరెక్టర్ అంజాద్ ఆలీ

తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 12 వ వార్డు లో మూడు సంవత్సరాల శిశువు మానసిక మరియు అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే స్పందించి దివ్యాంగుల పింఛను మంజూరు చేయించారు. కొత్త పెన్షన్ మంజూరు కావడంతో కుటుంబ సభ్యులు 12వ వార్డు కాలనీవాసులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సోమవారం నాడు దివ్యాంగుల పెన్షన్ నగదును షేక్ స్టేట్ డైరెక్టర్ అంజాద్ ఆలీ, మునిసిపల్ చైర్మన్ మారుఫ్ ఆసియా చేతుల మీదగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు వైసిపి నాయకులు సుశీలాబాయి, శేషారామ్సింగ్ , చిట్యాల వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!