ANDHRABREAKING NEWSTELANGANA

బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తున్నారు: సిపిఐ తాలూకా కార్యదర్శి శ్రీనివాసులు

తెలుగు వార్త :

బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తున్నారు: సిపిఐ తాలూకా కార్యదర్శి శ్రీనివాసులు.

నూతన కమిటీ ఎన్నిక కార్యదర్శిగా భీమలింగం.

తెలుగు వార్త న్యూస్: కొత్తపల్లి.

సిపిఐ కొత్తపల్లి గ్రామ శాఖ మహాసభ శనివారం స్టానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మండల కార్యదర్శి కె.వెంకట శివుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు సిపిఐ తాలుకా కార్యదర్శి కె.శ్రీనివాసులు హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న బి.జె.పి. ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ ఉందని, కార్మిక వ్యతిరేక విదానాలను అవలంబించడం చేస్తుందన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకొవడము జరిగింది. కార్యదర్శిగా టి.భీమలింగం సహాయ కార్యదర్శిగా టి. బాలకృష్హుడు ఏకగ్రీవంగ ఎన్నుకున్నారు.ఈకార్యక్రమంలొ మహిళ సమాఖ్య నాయకురాలు ముర్టుజాబీ తదితరులు పాల్గొంటున్నారు..

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!