ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో… టిడిపి పార్టీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 72 వ జన్మదిన వేడుకలు.
ఆత్మకూరు : మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 72 వ జన్మదిన వేడుకలు ఆత్మకూరు పట్టణంలో టిడిపి పార్టీ కార్యాలయం నందు శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు రక్తదానం చేసిన వారికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా టిడిపి నంద్యాల పార్లమెంట్ అధికార ప్రతినిధి మోమిన్ ముస్తఫా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కేకును కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు అపర మేధావిని, ముందుచూపు ఉన్నటువంటి వ్యక్తి అని అన్నారు. భావితరాలకు ఏమి అవసరమో ముందుగానే ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ లో ఉన్న ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని కావాలన్న, పరిశ్రమలు లేనటువంటి రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావాలన్న చంద్రబాబు నాయుడు వంటి సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ లో ఉన్న, కరెంట్ విషయంలో మాత్రం మిగులు ఉండేదన్నారు. వైసీపీ ప్రభుత్వం లో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు అని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనపద్ధతిగా జరగడం లేదని విమర్శించారు. నియంతృత్వ పద్ధతిలో కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నందు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.