
శ్రీసిటీ ఫౌండేషన్ చే గ్రామాల్లో దోమల నివారణ చర్యలు
*తెలుగు వార్త న్యూస్:శ్రీసిటీ, ఏప్రిల్ 02, 2022:
శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీసిటీ పరిధి గ్రామాల్లో దోమలవ్యాప్తి నివారణకై మురుగు నీరు నిల్వ వున్న ప్రాంతాల్లో మొలాతిన్, అభేడ్ మందు పిచికారి చేశారు. గత మూడు రోజులుగా మల్లవారిపాలెం వెస్ట్, మల్లవారిపాలెం ఈస్ట్, మల్లా టౌన్ షిప్, గొల్లవారిపాళెం, చెంగంబాక్కం గ్రామాల్లో ఈ పనులు పూర్తిచేయగా, వారంలోపు మిగిలిన అన్ని గ్రామాల్లో దోమల నివారణ, పారిశుధ్య చర్యలు చేపట్టనున్నట్లు ఫౌండేషన్ సిబ్బంది తెలిపారు. అలాగే గ్రామస్థులు తమ ఇంటి పరిసరాల్లో వృధా నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.