ANDHRABREAKING NEWS

శ్రీసిటీ జపాన్ పరిశ్రమల వితరణతో  సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్టూడెంట్ డెస్కులు పంపిణీ

తెలుగు వార్త :న్యూస్

శ్రీసిటీ జపాన్ పరిశ్రమల వితరణతో

సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్టూడెంట్ డెస్కులు పంపిణీ

తెలుగు వార్త న్యూస్:శ్రీసిటీ, మార్చి 31, 2022:

 

కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీసిటీ జపనీస్ కంపెనీస్ గ్రూప్ (ఎస్ జె సీ జీ) సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సుమారు 2 లక్షల రూపాయల విలువైన 30 స్టూడెంట్ డెస్కులు వితరణ ఇచ్చింది. శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యవేడు కళాశాల ఆవరణలో గురువారం ఉదయం శ్రీసిటీ జపనీస్ కంపెనీస్ గ్రూప్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డెస్కులను కళాశాల ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ కు అందచేశారు.

 

ఈ సందర్భంగా హిరానో మాట్లాడుతూ, 2017లో ఏర్పాటైన శ్రీసిటీ జపనీస్ కంపెనీస్ గ్రూప్ (ఎస్ జె సీ జీ) వరుసగా ఇదవ ఏడాది తమ సీఎస్ఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డెస్కులతో పాటు భవిష్యత్తులో మరింత అవసరమైన సాయం అందిస్తామన్నారు. విద్యార్ధి జీవితం ఎంతో విలువైనది అన్న ఆయన, ఓ వైపు బాగా ఎంజాయ్ చేస్తూ మరోవైపు మంచి భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు హితవు పలికారు. శ్రీసిటీలో 25కు పైగా జపాన్ పరిశ్రమలు ఉన్నాయని, భవిష్యత్తులో మీ అందరికి మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలంటూ విద్యార్థులతో కొంతసేపు ఆయన ముచ్చటించారు.

 

జపనీస్ గ్రూప్ వితరణ పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ తన ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు. శ్రీసిటీ ఆవిర్భావం నుంచి శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా స్థానిక పరిశ్రమల సహకారంతో పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్ళు, కళాశాలల అభివృద్ధికి, మౌళిక వసతుల పెంపుకు తాము పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. విద్యాప్రమాణాల పెంపుకు నిరంతరంగా సహాయసహకారాలు అందచేస్తాం అన్నారు. డెస్కులు సాయం అందించిన జపనీస్ ప్రతినిధులను ఆయన అభినందించారు.

 

కాగా, 370 మంది విద్యార్థులున్న సత్యవేడు కళాశాలలో ఒక్క స్టూడెంట్ డెస్కు కూడా లేదన్న స్కూల్ యాజమాన్యం విజ్ఞప్తికి శ్రీసిటీ ఫౌండేషన్ స్పందించి శ్రీసిటీ జపనీస్ కంపెనీస్ గ్రూప్ సహకారంతో డెస్కులు పంపిణీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 130 డెస్కులు ఇక్కడ అవసరముండగా, ప్రస్తుతం 30 డెస్కులు పంపిణీ చేశారు. త్వరలో మరో 100 డెస్కులు కూడా ఇవ్వనున్నట్లు శ్రీసిటీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఇదికాక, ఇదే జూనియర్ కళాశాలలో శ్రీసిటీలోని మరో పరిశ్రమ చేయూతతో 16 లక్షల వ్యయంతో మరుగుదొడ్లు నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. దశలవారీగా మరిన్ని విద్యావసతులు సమకూర్చేందుకు శ్రీసిటీ ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్ కుమార్, శ్రీసిటీలోని జపాన్ పరిశ్రమల ప్రతినిధులు సెంథిల్ కుమార్ (ఇసుజు), ఫుజ్జి (నిటాన్), తాకిబాన (ఎన్ ఎస్ ఇన్స్ట్రుమెంట్స్), కమాడ (టీ హెచ్ కె), ఆనంద (యూనిఛార్మ్), సకాయి (ఐసాన్), శ్రీసిటీ ఫౌండేషన్ ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!