ANDHRASPORTS

6వ జిల్లా స్థాయి బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

గురు రాజాలో ఘనంగా 6వ జిల్లా స్థాయి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిత్రో బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

తెలుగు వార్త :

నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీ నందు శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్రీడా ప్రాంగణంలో గురు రాఘవేంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారి స్మారకార్థం 6 వ జిల్లా స్థాయి త్రో బాల్ టోర్నమెంట్ క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి గారు , వెన్నపూస రవీంద్రారెడ్డి గారు,డాక్టర్ జి రామకృష్ణ రెడ్డి గారు ,డాక్టర్ రవి కృష్ణ గారు, డి ఎస్ డి ఓ రాజుగారు ,చిన్నపరెడ్డి గారు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకోచులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారి కాంస్య విగ్రహానికి పూలమాలవేసి క్రీడాజ్యోతిని అతిధులు వెలిగించారు. జాతీయ క్రీడ స్కూల్ పతాకాన్ని ఎంపీ గారు ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గురు రాఘవేంద్ర విద్యా సంస్థ చైర్మన్ దస్తగిరి రెడ్డి గారు మాట్లాడుతూ మా తండ్రిగారి స్మారకార్థం జిల్లా స్థాయి త్రో బాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాము విద్యార్థుల్లో దాగివున్న క్రీడా ప్రతిభను వెలికి తీసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి శారీరక దారుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి నేటితర విద్యార్థులకు ఇటువంటి క్రీడలు అత్యంత ఆవశకం. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరం కనుక ప్రతి విద్యార్థి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్నేహపూరిత వాతావరణం లో మీ ఆటను ప్రదర్శించాలని సందేశం అందించారు. ఈ క్రీడా పోటీలు ఈ క్రీడా పోటీలలో కర్నూలు , నంద్యాల జిల్లాల నలుమూలల నుండి 93 టీములు వారికి భోజన వసతిని అన్ని ఏర్పాట్లు చేశాము. విద్యార్థులు ఈ క్రీడలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

నంద్యాల ఎంపీ గారు మాట్లాడుతూ విద్యార్థులు బాల్య దశ నుండి శారీరక దారుణ్యాన్ని పెంచుకోవడానికి క్రీడలు ఎంతగానో దోదపడతాయి న్యాయనిన్యతలుగా వ్యవహరిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు నిష్పక్షపాతంగా క్రీడలను నిర్వహించి ప్రతిబ గల క్రీడాకారులను వెలికి తీసి ప్రతిభాపాటవాలను ప్రశంసించారు. అనంతరం శాంతికపోదాలను ఎగురవేసి జిల్లాస్థాయి త్రోబాల్ టోర్నమెంట్ వేడుకలను ప్రారంభించారు. అతిధులకు గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్లు శ్రీ మౌలాలి రెడ్డి , షావలి రెడ్డి గారు జ్ఞాపికలను అందజేసి పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఏపీ రెడ్డి, రమణారెడ్డి ,నాగరాజు, మోహన్ రెడ్డి , విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు శంకర్ ,దివాకర్ గారు వివిధ పాఠశాలల కోచులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!