
ఏసీబీ వలలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అదనపు ప్రోగ్రాం ఆఫీసర్
తెలుగు వార్త న్యూస్: కొత్తపల్లి
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అదనపు ప్రోగ్రామ్ ఆఫీసర్ మద్దిలేటి ఏసీబీ వలలో మంగళవారం నాడు చిక్కారు. కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన పి. రాధాకృష్ణ కు సెరికల్చర్ షెడ్డు నిర్మాణానికి ఒక లక్ష 30 వేల రూపాయలు నిధులు మంజూరు కావడంతో అందులో 15,000రూపాయలను లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400 ను సంప్రదించి ఫిర్యాదు చేయటంతో వెంటనే ఏసీబీ అధికారులు స్పందించి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పోగ్రామ్ ఆఫీసర్ ను పట్టుకున్నారు.